ఏ మతమైనా ఎమున్నది గర్వకారణం

కొంతకాలంగా హిందూ స్వాములు మతాన్ని అడ్డుపెట్టుకుని చేసిన వేషాలు మోసాలు వెలుగుచూశాయి. అవి మరువక ముందే క్రైస్తవ మతంలో కొన్ని వికెట్లు పడ్డాయి. కొంతమంది బ్లాగర్లు హిందూ స్వాములగురించి, హిందూ మతం గురించి వారికి మాత్రమే వచ్చిన రీతిలో ఎండబెట్టారు. మరి వారు ఇపుడెందుకు మౌనంగా వున్నారో వారికే తెలియాలి.



ఇక అసలు విషయానికి వస్తె,

రెండు అత్యంత హేయమైన సంఘటనలు వెలుగు చూసాయి. వాటికి క్రైస్తవ మతం లో అత్యంత పవిత్ర స్తలంగా భావించే "వాటికన్ సిటి" కి సంబందించినవారే వుండతం మరింత ఆశ్చర్యానికి గురి చేస్తుంది.

మొదటి సంఘటన..... ఏంజెలో బాల్డూసి, వాటికన్ సిటి లోని మత పెద్దలకు తరతరాలుగా సహాయకులుగా చేసిన వంశం లోనివాడు..ఇతను వ్రుత్తి రిత్యా ప్రభుత్వ కాంట్రాక్టులు చేసే వ్యాపారవేత్త....ఇప్పటికీ మత పేద్దలకు సహాయకుడిగా కొనసాగుతున్నాడు. ఇతను చేసిన కాంట్రాక్టులకు సంబందించి అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నాడు...దీనికి సంబందించి జరిపిన విచారణ లో భాగంగా ఎప్రిల్ 14, 2008 నుండి జనవరి 20, 2010 మధ్య లో ఈతని ఫొను సంభాషణలను రికార్డ్ చేసారు. ఆ సంభాషణల ఆధారంగా ఇతడు "మగ వ్యభిచారు"లను పై వారికి సప్ప్లయి చేసినట్లు బైటపడింది. ఈతనికి వాటికన్ లోని ప్రార్థన కచేరి కి చెందిన గాయకుదు "థొమస్ ఛినెదు ఏహిఎం" కూదా భాగస్వమి అని బైటపదినది. ఈ సంఘటన వాటికన్ లోని మతపెద్దల శీల, స్వభావాలపై అనుమానాలు రేకెత్తించింది.



రెండవది......క్రైస్తవుల ప్రత్యక్ష దేవుడైన పోప్ బెనెడిక్త్ Xవీ అన్న అయిన 'జార్జ్ రాటింజెర్ ' ఒక క్రైస్తవ మిషనరి స్కూల్ నడుపుతున్నాడు. 1964 నుండి 1994 వరకు రాటింజెర్ డైరెక్టెర్ గా చేసాడు. ప్రస్తుత పోప్ 1977-1981 మధ్య కాలం లో జర్మని లోని మ్యునిచ్ నగర ఆర్చి బిషప్ గా చేసాడు.ఆ సమయంలోనే, చర్చ్ లోని స్కూల్ లో చదువుకునే, కచేరీ లో పాడే పిల్లపై శారీరకంగా మరియు మానసికంగా లైంగిక వేదింపులు జరిగాయని ఆరోపణలు  ఎదుర్కొంటున్నారు.ఈ విషయం ప్రస్తుత పోప్ కు తెలుసుననేది మరింత కలవరపరిచే అంశం.



హిందూ మతం గురించి ఆడిపోసుకుని ....మా మతం అని చంకలు గుద్దుకునేవాళ్ళు ఇపుడు ఎలా స్పందిస్తారో చూడాలి...

  • Digg
  • Del.icio.us
  • StumbleUpon
  • Reddit
  • RSS
Read Comments

తెలుగు ప్రజలకు "కిక్కె కిక్కు"

బంపర్ ఆఫర్....బంపర్ ఆఫర్
 మన రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం ఒక బుంపర్ ఆఫర్ ఇవ్వబొతున్నందుకు నాకు చాలా సంతొషంగా వుంది..
 దేశంలొ సామాన్య ప్రజలు నిత్యావసర సరుకులు, దినుసుల రేట్లు పెరిగి అస్టకష్టాలు పడుతున్నారు. ఇది తెలిసికూడా కేంద్ర ప్రభుత్వం ఎం చేయలెని స్థితిలొ కొట్టుమిట్టాదుతొంది. ఇటువంటి కష్ట సమయం లొ మన ప్రభుత్వం పని తీరు చూసి ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు నేర్చుకోవల్సింది ఎంతైనా వుంది.
                      పెరుగుతున్న ధరలకు విరుగుడుగా, అదే సమయంలో ప్రజలను ఆనందంగా వుంచటానికి మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్నయం అభినందనీయం. ఆర్ధిక మంత్రి నుండి సీ.యం అయిన మన రొశయ్యగారు మద్యం ను ప్రస్తుత ధర (రు.45/-) తగ్గించి రు.35/- కె అందేలా ఎర్పాటు చేస్తున్నారు. ఇక ఎంచక్క అందరు కుటుంబ సమేతంగ తాగి అటు రాష్ట్ర ఖజానా నింపవచ్చు పనిలోపనిగా తమ నెలసరి ఖర్చులను అదుపులొ వుంచుకోవచ్చు.

                                       

ఈ సందర్భం లొ నేను కూడ మన రాష్ట్ర ప్రభుత్వానికి మరియు ప్రజానికానికి కొన్ని సూచనలు, సలహాలు పంపించాలనుకుంటున్నాను. అవి:

1. మన రాష్ట్రంలొ ఎన్నో 'మధ్యాన భోజన పధకం' క్రింద నడుపబడుతున్న పాఠశాలలకి సరఫరా చెస్తే, అటు వాతికి కేటాయించిన బుడ్జెట్ మిగులుతుంది. ఇటు ఆశించిన ఆదాయం వస్తుంది.

2. ఎటూ పాల ధరలు కూడా పెరుగుతయ్ కాబట్టి పాల బదులు ప్రజలకు మద్యం (బీర్ ఐతే బెటర్.....ప్రొద్దున్నే బార్లీ నీళ్ళు...ఆరొగ్యానికి మంచిది) అలవాటు చెస్తే ఇక ఆదాయమే ఆదాయం.

                                              
3. ప్రభుత్వ ఆస్పత్రులలొ రోగులకు మందుల బదులు ఇదే ఇస్తే వారికి నొప్పులు బాదలు లేకుండా హాయిగా వుంతారు....పైపెచ్చు "ఆరోగ్యశ్రి" నిధులు మిగులుతాయి.

4. ఇవాళ దేశంలో "చిన్న కారు" హవా నడుస్తొంది. ఎటూ ఇంధనం (పెట్రొల్, డీసెల్, గ్యాస్ మొ..) ధరలు కుడ పెరిగాయి కనుక మనం మద్యం తో నదిచే కారు కనిపెడితే బుంపెర్ హిత్ అవుతుంది.

5. కార్పొరేట్ ఆఫీసులలో చొఫ్ఫీ మెషిన్ కి బదులు వైన్, బీర్ మెషిన్ లు పెడితె ఇక ఎవరు ఆఫీసులనుండి ఇంటికి ఎల్లరు. అందువల్ల పని గంటలు పెరుగుతాయి తద్వారా రెండు విధాలుగా ఆదాయం సమకూరుతుంది.

నా ఈ సూచనలను కనుక అమలుపరిచినట్టైతె తప్పకుండ మన రాష్ట్రం యొక్క ఆదాయం అంచనాలను మించుతుందని తద్వారా మనం అమెరికా, రష్య, చైనా తదితర అగ్ర దేశాలకు అప్పు ఇచే స్థాయికి ఎదుగుతామని సవినయంగా మనవి చేసుకుంటున్నాను.

  • Digg
  • Del.icio.us
  • StumbleUpon
  • Reddit
  • RSS
Read Comments